10 May, 2026 | 2:43 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

షూటింగ్ చేస్తే చర్యలు తప్పవ్

09-08-2025 12:00 AM

టాలీవుడ్‌లో సినీకార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్-నిర్మాతల చర్చలు కొనసాగు తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నిర్మాతల మండలికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి షూటింగులు జరపవద్దని ఛాంబర్ వెల్లడించింది. ‘స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు.

ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలి. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పువు. చర్చలు, సంప్రదింపులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలి. తదుపరి సూచనలు ఇచ్చేవరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి” అని స్పష్టం చేసింది.