రాష్ట్రంలో 12 మంది అడిషనల్ డీసీపీలకు పదోన్నతి
16-12-2024 07:00 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో 12 మంది అడిషనల్ డీసీపీలకు నాన్ కాడర్ ఎస్పీలుగా తెలంగాణ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రమోషన్ తోపాటు పదోన్నతులు కల్పిస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం తాజాగా ఉత్తర్వులను జారీ చేశారు. రాచకొండ డీసీపీ పీ.కరుణాకర్ ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
పదోన్నతి పొందిన అదనపు డీసీపీలు వీళ్లే..
- కె. గుణశేఖర్ - మేడ్చల్ డీసీపీ (ట్రాఫిక్)
- జీ. నరసింహారెడ్డి - రాచకొండ డీసీపీ (స్పెషనల్ బ్రాంచ్)
- ఎస్. మల్లారెడ్డి - రాచకొండ డీసీపీ ( ట్రాఫిక్)
- మద్దిపాటి శ్రీనివాస రావు - సీఐడీ ఎస్పీ
- పీ. శోభన్ కుమార్ - మాదాపూర్ డీసీపీ (ఎస్వోటీ)
- టీ. సాయి మనోహర్ - మాదాపూర్ డీసీపీ (ట్రాఫిక్)
- డీ. రమేశ్ - ఎస్పీ (ఇంటెలిజెన్స్)
- జే. చెన్నయ్య - ఐసీసీసీ హైదరాబాద్ ఎస్పీ
- పీ. విజయ్ కుమార్ - సీఐడీ ఎస్పీ
- కె. మనోహర్ - రాచకొండ డీసీపీ (రోడ్ సేఫ్టీ)
- డీ. శ్రీనివాస్ - మేడ్చల్ డీసీపీ (ఎస్వోటీ)
- పీ. కరుణాకర్ - (డీజీపీకి రిపోర్ట్)






