17-12-2024 12:20:27 AM
బ్రిస్బేన్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (33 నాటౌట్), రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. రెండో టెస్టులో రాణించిన మిచెల్ స్టార్క్ మరోసారి అదరగొట్టి 2 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే గిల్ను (1) కూడా స్టార్క్ బోల్తా కొట్టించాడు.
ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీని హాజిల్వుడ్ ఔట్ చేయడంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్ (9) కాసేపు అడ్డుకున్నప్పటికీ కమిన్స్ బౌలింగ్లో వెనుదిరగడంతో భారత్ 44 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మరో ఎండ్లో కేఎల్ రాహుల్ మాత్రం ఓపిక ప్రదర్శిస్తూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు సాధించాడు. రోహిత్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే వర్షం ప్రారంభమవ్వడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
పిచ్ సీమర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న వేళ వరుణుడు అడ్డుపడకపోయుంటే భారత్ మరిన్ని వికెట్లు కోల్పోయేదే. రెండో రోజు తెరిపినిచ్చిన వరుణుడు మూడో రోజు మాత్రం ఆటకు అడ్డు తగిలాడు. వర్షం అంతరాయంతో మూడో రోజు కేవలం 34 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఆరేసిన బుమ్రా..