15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బంద్ లో పాల్గొన్న ఏఐఎఫ్ బి

18-10-2025 06:20 PM

కరీంనగర్ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ తెలంగాణ బంద్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ బస్టాండ్ వద్ద తెలిపిన నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయింపు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లు  ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.కేంద్ర క్యాబినెట్లో బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించి వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షుడు సత్య రావు, శ్రీనివాస్, ప్రసాద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.