01-06-2025 05:07:11 PM
25 ఏళ్ల అనంతరం మిత్రుల సందడి..
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని నాగార్జున పాఠశాల 1999-2000 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం ఆదివారం మళ్లీ ఒక్కచోట కలుసుకొని, ఆత్మీయ సమ్మేళనాన్ని హర్షోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యా బీజాలు నాటిన స్థలాన్ని సందర్శించి, గతాన్ని తలచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
విద్యార్థుల సాఫల్యంలో కీలకపాత్ర పోషించిన అప్పటి ప్రిన్సిపల్ నారాయణ రెడ్డిని, ఇతర ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి ఆశీస్సులు పొందారు. పాత రోజులను స్మరించుకుంటూ, ముచ్చటైన జ్ఞాపకాలను పంచుకుంటూ మిత్రులు ఒకరికొకరు మళ్లీ కలిసిన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా కృషి చేసిన రాకేష్ రెడ్డి వందనని మిత్రులందరూ ప్రత్యేకంగా సన్మానించి, వారి సేవలపట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో హాజరైన పూర్వ విద్యార్థి హృదయంలో ఓ మధురానుభూతిగా నిలిచింది.