12 March, 2026 | 9:44 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం

09-11-2025 05:34 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2015-16 విద్యాసంవత్సరం నుండి 2024–25 వరకు చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక రైతు వేదికలో రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు చెన్నూరు నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసమావేశంలో గ్రామస్తులు, నాయకులు, యువకులు, పూర్వ విద్యార్థులు హాజరై విద్యార్థులు, యువతకు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చర్చించి నిర్ణయించారు.

ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసి, స్వయం ఉపాధి లేదా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలను పొందేలా కృషి చేయడం, ఇందుకోసం ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ ద్వారా సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు మార్గనిర్దేశనం, చదువు ఆపేసిన పూర్వ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సమిష్టిగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రమాదేవి, ఉపాధ్యాయుడు వెంకట్ రావు, పలువురు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.