06-06-2025 12:29:12 AM
కార్వాన్, జూన్ 5: హైదరాబాద్ నగరాన్ని మరో ఢిల్లీ కానివ్వొద్దని జిల్లా ఇన్చార్జి, రవాణ శౠఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినొద్దీన్లతో కలిసి గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించి విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.
లేదంటే భవిష్యత్ తరాలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తాయని ఆందోళన వ్యక్తం చేశా రు. పర్యావరణానికి హానిగా మారిన ప్లాస్టిక్ కవర్లను ఎవరు కూడా వినియోగించవద్దని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.