calender_icon.png 7 June, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఏఎంసిచైర్మన్

07-06-2025 01:52:48 AM

కల్లూరు,జూన్06(విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగం గా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఆదేశానుసారం మండల పరిధి ఎర్ర బంజర గ్రామంలో శుక్రవారం కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి 15 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుండి గత బిఆర్‌ఎస్ ప్ర భుత్వంలో సొంత ఇంటి కల నెరవేరలేదని, ఇండ్ల కోసం అందరూ ఎదురు చూశారని అలాంటిది ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కృషితో సొంత ఇంటి కల నెరవేరుతుందని అందుకు మన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కి మనమంతా రుణపడి ఉండాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే కి కానుక ఇవ్వా లని కోరారు.

మంజూరి పత్రాలు అందుకు న్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టి, త్వ రగా పూర్తి చేసుకోవాలని అధికారుల ఆదేశాలతో ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని లబ్ధి దారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు,స్థానిక పెద్దలు రామారావు, స్థానిక నాయకులు తదితరులుపాల్గొన్నారు.