01-11-2025 05:58:37 PM
మల్యాల,(విజయక్రాంతి): మల్యాల రైతు పండించిన పంట ప్రతి గింజ కొంటాం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరిశ్రీనివాస్ అన్నారు. ఐకెపి ఆధ్వర్యములో లంబాడి పల్లి, తాటిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఏఎంసి చైర్మన్ బత్తిని మల్లీశ్వరిశ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వసంత, ఆర్ ఐ రాణి, ఏపియం దేవరాజ్, తక్కల్లపల్లి, సింగల్ విండో చైర్మన్ తొట్ల చంద్రశేఖర్, సి సీ గంగరాజాం, ఏఈఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద రెడ్డి, నరసింహారెడ్డి, శనిగరపు తిరుపతి, వెంకన్న, శ్రీనివాస్, సత్తన్న, మల్లారెడ్డి,మ్యక లక్ష్మన్, శ్రీను, బత్తిని మనోజ్ క్రాంతి గౌడ్, వివో ఏలు కొనుగోలు కేంద్రాల కమిటీ నివాహకులు, రైతులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.