17-08-2025 01:29:52 PM
న్యూఢిల్లీ: కథువాలో సంభవించిన మేఘా విస్ఫోటనంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ఆదివారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు. కేంద్రం నుండి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున కథువాలో జరిగిన రెండు వేర్వేరు మేఘాల విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలలో ఏడుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. కాగా, ఇప్పటికే స్థానిక పరిపాలన సహాయ, ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతోంది.
ప్రధాని మోడీ ప్రభుత్వం నుండి అన్ని రకాల మద్దతు లభిస్తుందని, జమ్మూ కాశ్మీర్లోని మా సోదరీమణులు, సోదరులకు మేము దృఢంగా, అండగా నిలుస్తాము" అని అమిత్ షా ఎక్స్ లో రాశారు. జిల్లాలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల మధ్య రాజ్బాగ్లోని జోధ్ ఘాటి గ్రామం, జాంగ్లోట్ను విపత్తు ముంచెత్తాయి. ఆగస్టు 14న జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని చిసోటి గ్రామంలో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 60 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. కిష్త్వార్లోని గ్రామంలో వరదలు సంభవించిన తర్వాత ఇప్పటివరకు 82 మంది తప్పిపోయారు. వీరిలో 81 మంది యాత్రికులు, సీఐఎస్ఎఫ్ నుండి ఒకరు ఉన్నారు.