13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

హామీల మరిచిపోయి.. ఉద్యమకారులపై ఉక్కుపాదం

30-03-2026 09:01 PM

చివ్వెంల: తెలంగాణ ఉద్యమకారులపై ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అనంతుల మధుతో పాటు భాషిపంగు సునీల్, ఏనిగా సంతోష్ రెడ్డి, భూక్యా నాగు నాయక్‌లను చివ్వెంల ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతుల మధు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.