20-06-2025 12:00:00 AM
: మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా
ఘట్ కేసర్, జూన్ 19 : సమస్యలు లేని అంగన్ వాడి కేంద్రాలుగా తీర్చి దిద్దాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్, ఏదులాబాద్ గ్రామాలలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా గురువారం పర్యటించి ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణాలు, అంగన్ వాడి కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏదులాబాద్ లోని అంగన్ వాడి కేంద్రంలో విద్యుత్, తాగునీరు సమస్యతో పాటు పరిశుభ్రతను పరిశీలించారు.
తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఏఈ రాకేష్ ను ఆదేశించారు. చుట్టు ప్రహరీ గోడ కావాలని కోరటంతో ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అదనపు గదుల ను ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ జగపతిబాబును ఆదేశించారు. ము న్సిపల్ పరిధిలోని అంగన్ వాడి కేంద్రాలలో సమస్యలు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆమె తెలిపారు.
ఘనపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె పరిశీ లించారు. ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని ఆమె చెప్పారు. అడిషనల్ కలెక్టర్ వెంట మున్సిపల్ కమీషనర్ చంద్రశేఖర్, మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కవిత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.