20-06-2025 12:00:00 AM
ఖైరతాబాద్, జూన్ 19 (విజయ క్రాంతి) : సామాన్య పౌరుల న్యాయ హక్కుల పరిరక్షణ కొరకు పనిచేసే లీగల్ రైట్స్ కౌన్సిల్ సంస్థ జాతీయ అధ్యక్షురాలిగా మందా రాజలక్ష్మిని కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఈ మేరకు శుక్రవారం ఖైరతాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎల్ఆర్సి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గుండ్లపల్లి శ్రీను ముది రాజ్ మాట్లాడారు..
బిజెపి మాజీ జాతీయ ఉపాధ్యక్షులు శ్యామ్ జాజు, ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలో జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అధ్యక్ష స్థానాలు కేవలం మహిళలకే కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం సంస్థకు మహిళల అభ్యున్నతి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.