12 June, 2026 | 12:23 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

ఢిల్లీ పేలుడు కేసు.. మరో నిందితుడు అరెస్ట్

17-11-2025 07:13 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈనెల 10వ తేదీన జరిగిన కారు పేలుడు కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.  జమ్ముకశ్మీర్ లో జసిర్ బిలాల్ వనిని అనే నిందితుడిని ఎన్ఐఏ బృందాలు సోమవారం అరెస్టు చేశాయి. బిలాల్ వని ఉమర్ నబీ కీలక అనుచరుడని, ఉమర్ నబీతో కలిసి ఉగ్రకుట్ర చేసినట్లు ఎన్ఐఏ బృందాలు గుర్తించాయి.

బిలాల్ వని డ్రోన్లు, రాకెట్లు తయారు చేయడంతో నిపుణుడని,  కారు బాంబు తయారీకి సాంకేతిక సహకారం అందించినట్లు ఎన్ఐఏ తెలిపింది. జసిర్ వని స్వస్థలం జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా ఖాజీగండ్ వాసి అని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ కారు పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలా వర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీను మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వీరికి ఢిల్లీ కారు పేలుడు కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.