6 May, 2026 | 8:29 PM

మెడికల్ విద్యార్థుల ఆందోళన

15-08-2024 02:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి)/సిద్దిపేట: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఈఎస్‌ఐ మెడికల్ విద్యార్థులు బుధవారం సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ మెడికల్ కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. అదేవిధంగా  సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.