23-06-2025 01:17:26 AM
బూర్గంపాడు,జూన్22(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రానికి మేకా నరసయ్య 2022 సంవత్సరంలో గోదావరి వరదల వలన పడవ ప్రమాదంలో మృతి చెందాడు. నరసయ్య కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబా బు నాయుడు 50 వేలు రూపాయలు ఆర్థికసాయం ఇస్తానని అప్పుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం టిడిపి పార్టీ తరఫున ఆదివారం ఆ కుటుంబానికి ఆర్థికసాయాన్ని అందజేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవ ర్గ మాజీ ఇన్చార్జి తాత మాధవి లత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుం బాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.