17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

టీచర్లకు పర్యవేక్షణ బాధ్యతలు ఆక్షేపణీయం

23-06-2025 01:16 AM

ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరు పర్యవేక్షణకు ఎస్జీటీ, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను నియమించడం ఆక్షేపణీయమని ఎస్టీ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, సదానందం గౌడ్ ఆదివారాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం విద్యారంగంలో సంక్షోభానికి దారితీస్తుందన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 629 మండలాల పరిధిలో మొత్తం 24,146 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, వాటిని తనిఖీ చేసేంత సమయం టీచర్లకు ఉండదని అభిప్రాయపడ్డారు.

పాఠాలు చెప్పేవారితో పర్యవేక్షణ చేయించడం శాస్త్రీయత కాదని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మరింత కుంటుపడతాయని తెలిపారు. ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయం తీసుకున్నదని, ఇప్పటికైనా ఆలోచనపై పున రాలోచించాలని విజ్ఞప్తి చేశారు.