12-06-2025 07:21:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల కళాశాల, పాఠశాలలో అతిథి అధ్యాపకులు, ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గురుకుల కళాశాల, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జి జె డేనియల్(Principal Daniel) ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం గాను ఇంటర్, పదవ తరగతి వరకు విద్యా బోధన చేయవలసి ఉంటుందని తెలిపారు. కళాశాలలో మ్యాథమెటిక్స్, వృక్ష శాస్త్రం జీవశాస్త్రం, సంస్కృతం సబ్జెక్టులు బోధించేందుకు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు బిఈడి సంబంధిత సబ్జెక్టులో పిజి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు.
మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అనుభవజ్ఞులకు ప్రాధాన్యత ఉంటుందని విద్యా బోధన డెమో ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 14 లోపు దరఖాస్తు చేసుకొని గురుకుల కళాశాలలో ఉదయం ఈ నెల 14 రోజున 10 గంటలకు డెమోకు హాజరు కావాలని అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని డెమో మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు గురుకుల కళాశాలలో లో దరఖాస్తు చేసుకోవాలని ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 9908016859 నంబర్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.