calender_icon.png 18 July, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించండి

18-07-2025 12:55:56 AM

  1. నూతన రైలుమార్గాలు మంజూరు చేయాలి
  2. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి
  3.  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెలపాలని కోరారు.

కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైల్ భవన్‌లో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రీజినల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. 

రీజినల్ రింగ్ రైలు..డ్రైపోర్ట్ బందరు ఓడరేవు అనుసంధాన మార్గాలు 

తెలంగాణలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డుకు సమాంత రంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని, ఇందుకు రైల్వే బోర్డు ఇప్ప టికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.

రూ.8వేల కోట్ల విలువైన ఈ రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్‌కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మ ధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని వివరించారు.

రీజినల్ రింగు రైలు ప్రాజెక్టుతో గ్రామీణ పేద రికం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బం దరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమా ర్గం మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందని కేంద్రమం త్రి దృష్టికి తీసుకెళ్లారు. 

కాజీపేట రైల్వే డివిజన్..

రాష్ర్టంలో రైల్వే ఆపరేషన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని కోరారు.

ఇందులో భాగంగా వికారాబాద్ (122 కి.మీ.- అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి- (100 కి.మీ.-అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్న కల్- (296 కి.మీ.-అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్- (97 కి.మీ.-అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, రామసహా యం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, రాష్ర్ట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి వికాస్‌రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.