30-09-2025 01:22:48 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో స్థానిక ఎన్నికల హడా వుడి మొదలైంది. మూడు విడుతల్లో సర్పం చ్, వార్డు సభ్యుల ఎన్నికలు, రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వ హించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమం లో పోటీదారుల సంతాన అంశం తీవ్ర చర్చ నడుస్తున్నది. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులంటూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
తర్వాత పలు మార్పులు జరిగాయి. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తి వేయలేదు. దీని ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు అనర్హులని తేల్చింది.
ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. గతేడాది డిసెంబర్ 20న జరిగిన రాష్ర్ట మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రి వర్గం ఆమోదించలేదు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. కాగా ఇటీవలి కాలంలో దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోందని, ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు తగ్గే చాన్స్ ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలను కనాలని ఆదేశించారు.
ఈ మేరకు ఏపీలోని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. దీంతో తెలంగాణలోనూ సవరిస్తారని చర్చ జరిగింది. ఇటీవల పంచాయ తీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసిన రాష్ర్ట ప్రభుత్వం సెక్షన్ 21(3)ని సవ రించలేదు. దీంతో ముగ్గురు పిల్లల నిబంధన యథాతథంగా ఉండనుంది. ఈ క్రమం లో పాత నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి.