13-05-2025 12:00:00 AM
రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో సక్సెస్ అందుకున్న దర్శకుడు మహేశ్బాబు పీ ఓ సినిమాను తెరకెక్కి స్తున్నారు. మేకింగ్ ఐటిల్ ‘Rapo22’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సూర్యకుమార్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 15న సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరామెన్ సిద్ధార్థ నుని కాగా వివేక్ మెర్విన్ సంగీతం సమకూర్చుతున్నారు.