25-09-2025 12:58:20 AM
హనుమకొండ సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి):ములుగు రోడ్డు లోని ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ( ఏ టి సి ) భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సదుపాయాలను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. బుధవారం ములుగు రోడ్డులోని ఐటిఐ ప్రాంగణంలో పురోగతిలో ఉన్న ఏటీసీ భవనం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఏటీసీకి వెళ్లేందుకు ఉన్న అంతర్గత రహదారిని పరిశీలించారు.
భవన నిర్మాణ పనుల పురోగతి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం గురించి అధికారులను, నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారుతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఏటీసీ కి సంబంధించిన అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అప్రోచ్ రోడ్డును వారం రోజుల్లో పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఏటీసీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ బాలుర ఐటిఐ ప్రిన్సిపల్ ఎం.చందర్, హనుమకొండ ఐటిఐ ప్రిన్సిపల్ జి. సక్రు పాల్గొన్నారు.