17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

23-06-2025 12:00 AM

గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి)/ శేరిలింగంపల్లి: సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గిరిజన తెగల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా, వారి సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే  పలు గిరిజన సంఘాల నాయకులు ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.