23-06-2025 12:00:00 AM
ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లో గత కొన్ని రోజులుగా వర్షా కాలం దృష్ట్యా విద్యుత్ తీగలు ఫీడర్ల పై అనుకొని వున్న చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది ఆదివారం తొలగించారు. రోడ్లపై చెట్ల కొమ్మల కుప్పలు పేరుకుపోవడంతో డివిజన్ ప్రజలు గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి కమిషనర్ తో సమస్య పై సమీక్షించి, చెట్ల కొమ్మలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవా లని కోరారు.
కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ క్రింద వెహికల్స్ ఏర్పాటు చేసి చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ వ్యాప్తంగా రోడ్లపై కుప్పలుగా పేరుకుపోయిన చెట్ల కొమ్మల ను జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు. కార్పొరేటర్ సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమా ర్ పర్యవేక్షించారు. బీజేపీ నేతలు ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్ ఉన్నారు.