కార్పొరేటర్‌పై అట్రాసిటీ కేసు నమోదు

30-04-2024 12:05:45 AM

వరంగల్ తూర్పు, ఏప్రిల్ 29: వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవిపై స్థానిక మిల్సకాలనీ పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉర్సు ప్రాంతానికి చెందిన పసునూరి అరవింద్ తనకు  వారసత్వంగా సంక్రమించిన 212 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో కార్పొరేటర్ బాధితుడి బంధువులతో కలిసి అరవింద్‌ను వేధింపులకు గురిచేశాడు. కులం పేరుతో దూషించి, ఆస్తి విషయంలో కలుగజేసుకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించినట్టు  బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడిని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో కోర్టులో హాజరు పరిచినట్టు స్థానిక మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.