హనుమకొండ, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీలో కవులపై బీజేపీ, ఏబీవీపీ చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. హనుమ కొం డలో మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ జయంతి వేడుకలను నిర్వహించడంతో పాటు కాళోజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. ప్రముఖ కవులు డాక్టర్ పసునూరి రవీందర్, నరేష్కుమార్ సూఫీ, మెర్సీ మార్గరెట్లను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడిని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావించాలన్నారు. దాడి చేసిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రాజేందర్, కుమారస్వామి, రామ్కుమార్, రమేష్, సతీష్, విజయ, జ్యోతి, శాంతి, సుజాత, కుందన్ తదితరులు పాల్గొన్నారు.