calender_icon.png 6 June, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై దాడి

20-05-2025 12:00:00 AM

లక్షెట్టిపేట, మే 19: పట్టణంలోని గోదావరి రోడ్డులో పేకాట స్థావరంపై సోమవా రం పోలీసులు అకస్మిక దాడి చేశారు. ఎస్త్స్ర సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రహ స్య సమాచారం మేరకు గోదావరి రోడ్డులో గల పేకాట స్థావరం పై దాడి చేయగా ఈ దాడిలో ఏడుగురు పేకాట రాయుళ్లను పట్టుకొని వారివద్ద నుండి రూ.2720తో పాటు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్త్స్ర తెలిపారు.

నిందితుల వివరాలిలా ఉన్నాయి. ఎంబడి వెంకటేష్, చిట్టుమల్ల రాకేష్, అబ్దుల్ , జాఫర్, బుద్దే రాయమల్లు, సాజిద్, గౌస్, గోయికారి వినోద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎస్సైతో పాటు పోలీసు బృందం పాల్గొన్నారు.