27-05-2025 04:05:54 PM
కేటీఆర్ సేన కేసముద్రం మండల అధ్యక్షలు కొండపెల్లి రాకేష్ రెడ్డి
మహబూబాబాద్,(విజయక్రాంతి): సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సరైంది కాదని, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేటీఆర్ సేన అధ్యక్షులు రాకేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజల నుండి దృష్టి మళ్లించడానికి, నిత్యం ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న ప్రజానేత మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంపు కార్యాలయం పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటన ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న నాయకుల పైన రౌడీ పాలన చేస్తూ దాడులకు దిగడం సిగ్గు చేటన్నారు. అలాగే రాజకీయ వేధింపు లో భాగంగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపించడం జరిగిందన్నారు. కల్పిత కేసులు ఎక్కువ కాలం నడవవన్నారు.