24-06-2025 12:53:06 AM
హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, జూన్ 23 (విజయక్రాంతి): ఏపీలోని తుళ్లూరు నియోజకవర్గం పెదపరిమి గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్కు సోమవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. దాతలు అంద జేసి న నిధులతో నియోజకవర్గంలో మొ త్తం మూడు కమ్యూనిటీ హాల్లకు శంకుస్థాపన చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు.
ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో తన భాగం కంటే సూదనగుంట రాఘవేంద్రప్రసాద్, ఆయన సతీమణి కళ్యాణిప్రసాద్ కృషే ఎక్కువగా ఉన్నదన్నారు. అమెరికాలో ఉండగా పగలు, రాత్రి తేడా లేకు ండా ప్రజలకు వైద్యం చేసి, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నుంచి 43 శాతం ప్రభుత్వానికి పన్నులు చెల్లించి, మిగిలిన దానిలో నుంచి మనకు కమిటీ హాల్ నిమిత్తం దానం ఇ చ్చిన గొప్ప వ్యక్తులని తెలిపారు.
వారు అందించిన వాటిలో నుంచి తొమ్మిది కమ్యూనిటీ హా ల్స్ నిర్వహించబోతుండగా, అందులో మూడు తాడికొండ నియోజకవర్గంలోని రావెల, పెదపరిమి, పొనుగుపాడు గ్రామాల్లో నిర్మిం చబోతున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఈ మూడు ప్రాంతాలను ఎంపిక చేసి సహకరించిన స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ను అభినందించారు.
స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ఎప్పుడైనా ఏ అభివృద్ధి అయినా సరే ప్రతి ఒ క్కరూ చేయి, చేయి కలిపితేనే సాధ్యమవుతుందన్నారు. తమ ప్రాంతం కాకపోయినా సరే కేవ లం కేంద్రమంత్రి పెమ్మసానితో ఉన్న సత్సంబ ంధాల కారణంగా పార్లమెంటు పరిధిలో తొమ్మిది క మ్యూనిటీ హాళ్లను, అందులోనూ మూడింటిని మన నియోజకవర్గానికి రాఘవేంద్ర ప్రసాద్ అందించడం హర్షించదగ్గ విష యమన్నారు.
టీడీపీ యువ నాయకుడు తాళ్ల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. తమ పార్లమెంటు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, క మ్యూనిటీ హాల్స్, ఆర్ఓబి వంతెనలు, రహదారులు వం టి ఎన్నింటినో తీసుకురావడానికి పెమ్మసాని చేస్తున్న కృషి ఎన్నటికీ మరువలేమన్నారు. కా ర్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.