18 August, 2026 | 7:54 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

చెరువు శిఖం కబ్జాకు యత్నం

29-11-2024 01:23 AM

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుతో పాటు మరో ముగ్గురిపై కేసు

శేరిలింగంపల్లి, నవంబర్ 28: ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు శిఖం భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఇరిగేషన్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యా దు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సదరు స్థలాన్ని మట్టితో చదును చేస్తున్న వారిని, జేసీబీ ఓనర్ నరేశ్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు 700 గజాల స్థలాన్ని మట్టితో నింపినట్లు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు డైరెక్షన్‌లోనే చెరువు శిఖాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలుసుకున్నారు.

ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ బీ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రావుతో పాటు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, మణికంఠలపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలో శ్రీధర్‌రావుపై మరో కేసు నమోదైంది. తమ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను శ్రీధర్‌రావు కూల్చివేయించారని బాధితులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.