calender_icon.png 1 August, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి మోజులో పడి భర్తపై హత్యాయత్నం

30-07-2025 06:27:33 PM

భర్తను హత్య చేసేందుకు భార్య సుపారి..

నలుగురి అరెస్ట్, రీమాండ్..

ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ప్రియుడి మోజులో పడ్డ భార్య తన భర్తను హత్య చేయించి వైదొలిగించుకోవాలని భావించి సుపారి ఇచ్చి చంపాలనుకొని చివరికి ఆమెతో పాటు ప్రియుడు, సుపారికి వచ్చిన మరో ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు(DSP Srinivasa Rao) విలేకరుల సమావేశంలో హత్యాయత్నం కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన, సంపూర్ణ అనే మహిళ అదే గ్రామంలో ఆశ వర్కర్ గా పనిచేస్తుంది. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన జాన్సన్ అనే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకొని, తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారని భర్తనే కడ తీర్చాలని కసిగట్టి పక్కా ప్లాన్ తో అతన్ని చంపడానికి కిరాయి రౌడీలను పిలిచి అంతమొందించడానికి కథ ప్రారంభించింది. 

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి సుపారీ ఇచ్చింది. పథకం ప్రకారం నాగిరెడ్డిపేట మండల శివారు సరిహద్దు ప్రాంతంలోని ఓ వైకుంఠధామం ప్రాంతంలో 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో అంతమందించడానికి పన్నాగం పని అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని సంపూర్ణ భర్తను రవి అనే వ్యక్తిని ఇనుప రాడ్లతో సుత్తితో దారుణంగా సుపారి తీసుకున్న, అంతకులు తాండూరు గ్రామానికి చెందిన బిక్కనూర్ రాజు, అదే గ్రామానికి చెందిన తానుగొండ శ్రీహరి, ఆత్మకూరు గ్రామానికి చెందిన ఇంకో వ్యక్తి మరియు సంపూర్ణ ప్రియుడు జాన్సన్ నలుగురు కలిసి అతి దారుణంగా ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టి చంపడానికి ప్రయత్నించారు.

దాంతో క్షతగాత్రుడు రవి, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించగా రాజు అనే వ్యక్తి అతి దారుణంగా అతనిని కిరాతకంగా హతమర్చడానికి ప్రయత్నించాడని గాయాల పాలైన వ్యక్తి రవి తెలిపినట్లు డిఎస్పి తెలిపారు. పథకం ప్రకారం సంపూర్ణ భర్త రవికి డబ్బు అప్పుగా ఇస్తామని ఆశ చూపిన జాన్సన్ అతడిని ఈనెల 24న పెద్దారెడ్డి గ్రామ డంప్ యార్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి రవి తలపై సుత్తితో బాదాడు. దీంతో రవి వారినుంచి తప్పించుకుని ఆత్మకూరు గేటు సమీపంలోని ఓ ఫామ్ హౌస్ వైపు పారిపోయాడు. పారిపోతున్న వ్యక్తి క్షతగాత్రునిపై, అతి కిరాతకంగా అంతమొందించడానికి రాజు జాన్సన్ శ్రీహరి ఇంకొక వ్యక్తి వెంబడించి మరీ రాళ్లతో సుత్తితో దాడి చేశారు.

దాంతో క్షతగాత్రుడు సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లోకి దూరి తన ప్రాణాలను దక్కించుకొని గ్రామస్తులకు సమాచారం తెలుపుకొని ఆసుపత్రికి  చేరుకొని తన ప్రాణాలను కాపాడుకున్నట్టు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం డిఎస్పి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి హత్యకు కారణమైన భార్యతో సహా ప్రియుడు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ముగ్గురు మొబైల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సదాశివనగర్ సీఐ సంతోష్, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.