15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ఎప్‌సెట్‌కు 93.86 శాతం మంది హాజరు

03-05-2025 11:49 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ ఎప్‌సెట్ పరీక్షకు శనివారం 93.86 శాతం మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో అభ్యర్థులకు రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఉదయం సెషన్‌కు 93.81 శాతం, మధ్యాహ్నం సెషన్‌కు 93.86 శాతం మంది హాజరయ్యారు. తొలి సెషన్‌లో 34,607 మంది హాజరవ్వగా.. 2, 285 మంది గైర్హాజరయ్యారు. ఇక రెండో సెషన్‌లో 34,620 మంది పరీక్ష రాయగా.. 2,265 మంది డుమ్మా కొట్టారు. నేటితో ఎప్‌సెట్ పరీక్షలు ముగియనున్నాయి.