17 April, 2026 | 2:09 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం

04-05-2025 12:22 AM

భార్య మృతి

చికిత్స పొందుతున్న భర్త

 రాజేంద్రనగర్, మే 3: ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన దంపతు లు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

ఏదులాబాదుకు చెందిన రమేశ్ చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ బాలనగర్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ షాప్ నిర్వహిస్తున్నడు. ఇతనికి రాజేశ్వరి(38), ఓ కూతురు ఉం ది. కొంతకాలంగా రమేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ దివాలా తీశాడు. దీంతో భార్య రాజేశ్వరి మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ఆసుపత్రిలో చేరింది.

అనంతరం ఆమె ఆరో గ్యం కుదుటపడింది. దిక్కుతోచని స్థితి లో ఉన్న వారికి మియాపూర్ లో ఉం టున్న రమేష్ సోదరి అండగా నిలిచిం ది. ఆమెకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రబోడలో ఇల్లు ఉంది. నెల రోజుల క్రితం రమేష్, రాజేశ్వరిని ఆ ఇంట్లో ఉంచి రెండు నెలలకు సరిపడే రేషన్ సమకూర్చి మంచిగా ఉండాలని సూచించింది.

ఇదిలా ఉంటే ఏప్రిల్ 30న రాత్రి రమేష్, రాజేశ్వరి గడ్డి మం దు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అర్ధరాత్రి రాజేశ్వరికి వాంతులు, విరోచనాలై అక్కడే మృతి చెందింది.రమేష్ కూడా వాంతులు, విరోచనాలు కావడంతో స్థానికులు  ఆసుపత్రికి తరలించ గా చికిత్స పొందుతున్నాడు. కు టుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.