28-07-2025 11:34:50 PM
వరంగల్ క్రైమ్ (విజయక్రాంతి): హనుమకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో(Warangal Public School) సోమవారం అటెండర్ పోలెపాక శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందారు. బట్టుపల్లి గ్రామానికి చెందిన పూలెపాక శ్రీనివాస్ పది సంవత్సరాల నుండి అటెండర్ గా వరంగల్ పబ్లిక్ స్కూల్ లో విధులు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా పాఠశాలలో పోలేపాక శ్రీనివాస్ మృతదేహం లభించడంతో విద్యార్థులు పాఠశాల యాజమాన్యనీకి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విలేకరులను పాఠశాల లోపటికి పంపించకుండా పోలీసులు, యాజమాన్యం అడ్డుకోవడం కొసమెరుపు. ఏది ఏమైనప్పటికీ మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మృతునికి ఒక కొడుకు, ఇద్దరూ కూతుళ్లు, భార్య ఉన్నట్లు సమాచారం.