09-06-2025 01:11:18 AM
మేడ్చల్, జూన్ 8 (విజయ క్రాంతి): ఆస్ట్రేలియా పార్లమెంట్ స భ్యులు సీనా వాట్, లీటార్ల మిస్ ఆదివారం కీసర గుట్టపైన శ్రీ రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. కీసరకు వచ్చిన వీరిని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీసరగుట్ట పైకి తీసుకెళ్లారు.
అంతకుముందు కీసరలో ఆస్ట్రేలియా ఎంపీలకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సంప్రదాయ బోనాలు, బతుకమ్మ తో స్వాగతం పలికారు. ప్రధాన కూ డలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ద్మగూడ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.