calender_icon.png 9 June, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

09-06-2025 01:12:37 AM

ఆర్మూర్, జూన్ 8 (విజయ క్రాంతి) : ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశా ల పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 196667 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు 58 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి మిత్రు లతో సరదాగా గడిపారు. అలాగే తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేశారు.

గౌరవాధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి చిట్ల పార్థసారధి, అధ్యక్షుడిగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ మోహన్ రావు, ప్రధాన కార్య దర్శిగా రాజేశ్వర్, కోశాధికారిగా రిటైర్డ్ బ్యాంకు క్యాషియర్ మధుసూదన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత హెచ్‌ఎం లక్ష్మీ నర్సయ్య, భూమేశ్వర్, రాజేందర్, గంగనర్సయ్య, వినాయక్ రావు, తదితరులు పాల్గొన్నారు.