09-06-2025 01:10:36 AM
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులను చేర్చండి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ధాశిరాం
ఎల్లారెడ్డి జూన్ 8 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని వార్డ్ నెం 11 లోని లింగారెడ్డిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపధ్యాయులు కె దాసీరాం మరియు ఉపాధ్యాయులు సి హెచ్ రామకృష్ణ, టి ఉమాదేవి లు కలిసి లింగరెడ్డిపేట్ పరిధిలోని శ్రీరామకాలనీ, లింగరెడ్డిపేట తండా ప్రాంతాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
ఆదివారం మరియు మృగశిర పండగ ఉండటం వలన ఎక్కువ సంఖ్యలో తల్లితండ్రులు ఇంటివద్దనే ఉంటారు, కావున ఎక్కువ మందికి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించవచ్చు అని ఇట్టి కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఆంగ్ల మాధ్యమం, ఉచిత బట్టలు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, తదితర సౌకర్యాలను తల్లితండ్రులకు వివరించవచ్చుననని ఆయా ప్రాంతాల్లో చాలా మంది తల్లితండ్రులు కలవడం జరిగింది
వారితో పాటు స్థానికంగా ఉండే ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అమీల మరియు వినోద్ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్థానిక తల్లితండ్రులకు అవగాహన,కల్పించారు.పండగ పూట కూడా బడిబాట నిర్వహిస్తున్నందుకు టీచర్స్ కి స్థానికులు ప్రశంసించి తప్పకుండా వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తం అని హామీ ఇవ్వడం జరిగింది.