16-06-2025 10:56:01 PM
రెవల్యూషన్ యూత్ ఆధ్వర్యంలో సింగరేణి సీఎండికి వినతిపత్రం..
మందమర్రి (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నేత దివంగత ఎండి మునీర్(MD Munir) విగ్రహాన్ని సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు, సింగరేణిలో మునీర్ పేరిట పురస్కారాలు అందజేయాలని రెవల్యూషన్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు, జర్నలిస్ట్ అనిల్ భగత్, ఉపాధ్యక్షుడు అక్బర్ లు కోరారు. ఈమేరకు హైదరాబాద్ లోని సింగరేణి భవనంలో సింగరేణి సిఎండి ఎం బలరాం నాయక్(Singareni CMD Balaram Naik)కు రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు, అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు. కోల్ బెల్ట్ లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యల పై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం అందించాలన్నారు. మునీర్ మృతి సమాజానికి తీరని లోటు అని ఆయన విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కమిటీ ని ఏర్పాటు చేస్తామన్నారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన జర్నలిస్ట్ మృతి నల్ల నేలకు తీరని లోటు అని, సింగరేణి చరిత్రలో ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచి ఉంటారనీ ఆన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ లు ఉన్నారు.