16-06-2025 10:57:25 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండల కేంద్రంలో బుక్క స్వాతి వీరన్న దంపతుల ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవ వేడుక సోమవారం ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా హోమం, పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు బొడ్రాయికి జల బిందెలతో తరలివచ్చి జలాభిషేకం నిర్వహించారు. బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు బంధుమిత్రులు పెద్దఎత్తున తరలిరావడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది.