calender_icon.png 17 June, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

16-06-2025 10:53:20 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): హైదరాబాదులోని సోమాజిగూడలో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy)ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల మనుగడని, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని వారు అన్నారు. మంత్రిని కలిసిన వారిలో రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ సొల్లు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సొల్లు బాబు, మాల మహానాడు నాయకుడు పాక సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండెపు సారంగపాణి, కరీంనగర్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ బండి మల్లేశం, కత్తెర మల్ల సదానందంతో పాటు తదితరులు పాల్గొన్నారు.