25-06-2025 01:10:33 AM
కొత్తగూడెం,జూన్ 24 (విజయ క్రాంతి)మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం తో కలిసి రావాలని, దీనిని నిర్మూలించకపోతే సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుందనీ, విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వీటికి యువత ఎంత దూరంగా ఉండాలనీ టూ టౌన్ సిఐ ప్రతాప్ అన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డిఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆదేశాల మేరకు మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటుపడి యువత తమ మేధా శక్తిని, శారీరిక శక్తిని,వృథా చేసుకోకూడదన్నారు. డ్రగ్స్ ఒకసారి వాడినా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని యూత్ సోషల్ స్టేటస్, ఫ్యాష న్గా ఎంచుకుంటోందని, దీనిద్వారా విలువైన జీవితాలు నష్టపోతారన్నారు. భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ , సిబ్బంది టూ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.