25-06-2025 01:10:01 AM
యాదాద్రి భువనగిరి జూన్ 24 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమం లో భాగంగా భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు ఎరువులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కల్తీ ఎరువులు మార్కెట్లో రాకుండా కట్టడి చేయాలని సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.