calender_icon.png 25 June, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి

25-06-2025 01:12:14 AM

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ 

సూర్యాపేట, జూన్ 24 (విజయక్రాంతి) : ప్రతి విద్యార్థి పర్యావరణం పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటేషన్ (ఎన్ ఎస్ పి సి)-2025 పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జులై 1 వ తారీకు నుండి  విద్యార్థుల కోసం పర్యావరణ క్విజ్ పోటీకి నమోదు ప్రారంభం అవుతుందని వాతావరణం మార్పుల పర్యావరణాల నుండి రక్షణకు విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులందరూ పోటీల్లో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. ’హరిత వే ఆఫ్ లైఫ్’ అనే థీమ్ పై దేశ వ్యాప్తంగా  ఎన్ ఎస్ పి సి పోటిని నిర్వహిస్తుంది.

ఈ క్విజ్ పోటీకి జూలై 1 నుండి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందని, ఫలితాలు ఆగస్టు 30న ప్రకటించబడతాయన్నారు. ఒకటో తరగతి నుండి పరిశోధన విద్యార్థులు వరకు ఐదు విభాగాల్లో పోటీ నిర్వహించబడుతుందని తెలిపారు.

ఎకోమిత్రం అప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో క్విజ్ ప్రశ్నలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డి ఇ ఓ అశోక్, జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, సెక్టోరల్ అధికారి శ్రావణ్, జనార్దన్, రాంబాబు, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.