31-12-2025 03:27:10 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి భక్తులు స్వామివారి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల గుండా సాగిన రథయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి దీక్ష ధారణ చేసిన స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చేసిన భజనలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సాయిరి మహేందర్ పద్మ దంపతుల ఆధ్వర్యం లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముస్త్యాల రవీందర్ పెద్ద ఎత్తున భక్త బృందం పాల్గొన్నారు.