calender_icon.png 7 June, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడిబాట కార్యక్రమం - గ్రామసభ

06-06-2025 11:44:40 PM

ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం, పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రోజు బడిబాట కార్యక్రమం అధికారికంగా జిల్లాలోని పాఠశాలలు ఉన్న అన్ని గ్రామాలలో గ్రామసభతో ప్రారంభం చేయడం జరిగింది. ఖాజీపేట మండలం మడికొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి అధ్యక్షతన  జరిగిన గ్రామసభకు ముఖ్య అతిధిగా పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి హజరు కావడం జరిగింది.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, అంగన్వాడి టీచర్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, యువకులు హాజరైన ఈ సమావేశంలో ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి  మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ బడులలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో ప్రభుత్వం అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు తమ పరిధిలో గల ఆవాస ప్రాంతం లో ప్రతీ ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను వివరించి, ప్రభుత్వ బడి పట్ల తల్లితండ్రులకు విశ్వాసం కల్పించాలని సూచించారు.

ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల కు కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలేజెన్సీ ) విధానంలో తరగతి బోధన ఉంటుందని దానికి అనుగుణంగా పాఠాలా రూప కల్పన జరిగిందని వివరించారు. లక్షల రూపాయల వ్యయం తో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. ఆంగ్ల భాష నైపుణ్యం పెంచడానికి, ఎన్.ఎం.ఎం.ఎస్, గురుకుల, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల తయారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, కృత్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రెండు జతల ఏకరూప దుస్తులు ఇవ్వడం గ్రంధాలయం, ప్రయోగశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పారు. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు.