16-02-2026 02:53:51 PM
ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి అడ్లూరి
ధర్మపురి,ఫిబ్రవరి16 (విజయక్రాంతి): ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఛైర్మెన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారo కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ ఛైర్మెన్ గా వేముల నాగలక్ష్మి ,వైస్ చైర్మన్ గా ఇందారపు రామన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మపురి పట్టణ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విజయపట్టం కట్టిన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనీ ఈ సందర్బంగా ఎన్నికైన నూతన పాలక వర్గానికి మంత్రి అడ్లూరి సూచించారు.