11-02-2026 03:33:21 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుద్దాల హేమసాగర్ బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సుద్దాల హిమ సాగర్ పట్టణంలోని టేకుల బస్తి నివాసి. కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొంది బెంగళూరులో స్థిరపడ్డారు. ఓటు హక్కు కోసం ఆయన బెల్లంపల్లికి వచ్చి బజార్ ఏరియా జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలోఓటు వేశారు. సుదూర.ప్రాంతంలో ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన సదరు ఉద్యోగి బెల్లంపల్లి కి వచ్చి ఓటు వేసి తమ ఓటు హక్కు పై చాటుకున్నారు.