05-07-2025 01:33:09 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ను శుక్రవా రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారు లు విచారించారు. హైదరాబాద్కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సం బంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో అల్లు అరవింద్ను ఈడీ సుమారు మూడు గంటల పాటు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత పేరు ఇలాంటి కేసులో వినిపించటం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017--19 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 101 కోట్ల రుణం తీసుకొని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రామ కృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ నుంచి అల్లు అరవింద్కు చెందిన సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం మొదట సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది. సీబీఐ ప్రాథమిక విచారణ అనంతరం ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ కోణం ఉందని గుర్తించి, ఈడీకి సమాచారం అందించింది.
ఆ తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే బ్యాంక్ అధికారులు, రామకృష్ణ సంస్థల ఆర్థిక లావాదేవీలను నిర్వ హించిన వారితో పాటు పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనేక కీలక పత్రా లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
మూడు గంటల పాటు సుదీర్ఘ విచారణ
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్కు చెందిన సంస్థల మధ్య జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై స్పష్ట త కోరుతూ అధికారులు ఆయనకు నోటీసు లు జారీ చేశారు. ఈడీ కార్యాలయానికి హాజరైన అల్లు అరవింద్ను అధికారులు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొ నుగోళ్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ నుంచి అల్లు అరవింద్ సంస్థలకు నిధులు ఎలా వచ్చాయి, వాటిని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించారు. వాటి వెనుక ఉన్న వాస్తవ ఉద్దేశాలు ఏమిటి వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్టు తెలుస్తోంది.
అల్లు అరవింద్ ఈడీకి పూర్తిగా సహకరించారని, తమ సంస్థల లా వాదేవీలన్నీ పారదర్శకంగానే జరిగాయని వివరణ ఇచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గా లు తెలిపాయి. అయితే, ఈడీ అధికారులు మాత్రం అన్ని కోణాల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఒక మైనర్ వాటా దారుడుగా ఉన్న ప్రాపర్టీకొన్నానని, దానిపై ఈడీ విచారణ జరిపిందని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.
వచ్చే వారం మళ్లీ రండి..
విచారణ ఇంకా పూర్తికానందున, వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు అల్లు అరవింద్కు సూచించినట్టు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూ ప్ యజమానులు వీ రాఘవేంద్ర, వీ రవి కుమార్లతో అల్లు అరవింద్కు ఉన్న సం బంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. గతం లో వీరిద్దరితో అల్లు అరవింద్కు ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా, లేదా వారి మధ్య ఇతర ఏమైనా ఒప్పందాలు జరిగాయా అనే కోణంలో ఈడీ దర్యాప్తు కొన సాగిస్తోంది.