06-09-2025 06:33:17 PM
కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్కను కలిసిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్. నాయకులతో కవిత ను కలిసి మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బిసి ఉద్యమ బలోపేతం, నలబై రెండు శాతం రిజర్వేషన్ పైన మరింత తీవ్రస్థాయిలో ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలని బిసి రిజర్వేషన్ అమలు కోసం జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా భవిష్యత్తులో అనేక కార్యక్రమల రూపకల్పన జరుగుతుందన్నారు.