బీసీ నేతకు బిజెపిలో సముచిత స్థానం
31-03-2026 04:27 PM
నిర్మల్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో తనకు సముచిత స్థానం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని వి సత్యనారాయణ గౌడ్ అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా నిర్మల్ చెందిన బీసీ నేత మాజీ జెడ్పి చైర్మన్ వల్ల కొండ సత్యనారాయణ గౌడ్ కు అవకాశం దక్కింది. ఇప్పటికి ఆయన నిర్మల్ ఎంపీపీగా, కాకతీయ పాలకవర్గ సభ్యులుగా, ఉమ్మడి జిల్లా ,జడ్పీ చైర్మన్ గా పనిచేసి 2023లో బిజెపిలో చేరారు. అప్పటినుండి పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న ఆయనకు రాష్ట్ర కమిటీ లో అవకాశం దక్కడం పట్ల బీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆయన తెలిపారు




